యూపీలో సేమ్ సీన్.. దళిత యువకుడు మృతి
posted on Aug 5, 2016 @ 12:09PM
ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో దళితులపై అరాచకాలు ఎక్కువవుతున్నాయన్న నేపథ్యంలో పార్లమెంట్ సభల్లో దుమారం రేగుతోంది. ఇప్పుడు దీనికి తోడు మరో ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగతనం కేసులో అరెస్ట్ చేసి తీసుకువచ్చిన దళిత వ్యక్తిని పోలీసులు చితక్కొట్టడంతో అతను మరిణించాడు. ఇప్పుడు ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. వివరాల ప్రకారం. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీసు స్టేషన్ లో పోలీసులు దొంగతనం కేసులో కమల్ వాల్మీకి అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అయితే అతనిని పోలీసులు కొట్టడంతో లాకప్ లోనే మరణించాడు. దీంతో యువకుడి బంధువులు, దళిత సంఘాలు నిరసనలకు దిగాయి. పోలీసులే కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులకు విషయం తెలిసి ఆ స్టేషన్ లో పని చేస్తున్న మొత్తం 14 మంది సిబ్బందినీ సస్పెండ్ చేసింది. మరోవైపు దళిత వర్గం నేత మాయావతి దీనిపై స్పందించి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి యూపీలో గత కొన్ని రోజులుగా దళితులపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..