ఏపీలో భయం, భయం..
posted on May 2, 2021 @ 7:27PM
ఆంధ్రప్రదేశ్లో కరోనా పరుగులు తీస్తుంది. ఒకే రోజు ఆకాశంలోకి రాకెట్ దూసుకుపోయినట్లు కరోనా కేసులు దూసుకుపోయాయి. కొత్తగా వచ్చిన కరోనా కేసులను చూసి ఏపీ ప్రజలు గందరగోళంలో పడ్డారు. ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం కరోనా కంగు తినిపించింది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైన తర్వాత తొలిసారి 23వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 పరీక్షలు నిర్వహించగా.. 23,920 కేసులు నిర్ధారణ కాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,45,022 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,66,02,873 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
కొవిడ్తో తూర్పు గోదావరిలో 12 మంది; విశాఖ, అనంతపురం, కృష్ణాలో 8 మంది చొప్పున; ప్రకాశం, విజయనగరంలో ఏడుగురు చొప్పున; చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; గుంటూరులో ఐదుగురు; కర్నూల్లో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,136కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,411 మంది బాధితులు కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 9,93,708కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,178 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 2,945 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్ బారినపడ్డారు.
జిల్లాల వారీగా కేసులు..