ఏపీలో మరో 52 కరోనా కేసులు
posted on May 18, 2020 @ 12:02PM
ఆంధ్రప్రదేశ్లో కరోనా పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,713 శాంపిల్స్ ను పరీక్షించగా మరో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,282కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 705 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,527 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన 52 కేసుల్లో.. చిత్తూరులో 15, తూర్పుగోదావరిలో 5, కడపలో 2, కృష్ణాలో 15, కర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖపట్నంలో 1, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.