తెలంగాణాలో కొత్త కేసులు 1198, డిశ్చార్జి అయిన వారు 1885
posted on Jul 21, 2020 9:22AM
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. నిన్న కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 510 కేసులు, రంగారెడ్డిలో 106, మేడ్చల్ లో 76, వరంగల్ అర్బన్ లో 73, కరీంనగర్ లో 87, జగిత్యాల, మహబూబాబాద్ లో 36 చొప్పున, నాగర్ కర్నూల్ లో 27, జనగామలో 12, నిజామాబాద్ లో 31 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కి చేరింది. అంతే కాకూండా మరో ఏడుగురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 422కి చేరుకుంది. ఇది ఇలా ఉండగా నిన్న1,885 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 11,530 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.