కేసీఆర్ కు కేంద్రమంత్రి పంచ్.. 'ముందు అవి వాడండి మహాప్రభో'..
posted on Jun 18, 2016 @ 12:32PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర వైద్యం, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఝలక్ ఇచ్చారు. ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంది కానీ తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తమకు మరిన్ని నిధులు కావాలని కేంద్రానికి లేఖలు మీద లేఖలు రాస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన జేపీ నడ్డా.. 'ముందు మేమిచ్చిన నిధులను ఖర్చు చేయండి మహా ప్రభో అంటూ' కేసీఆర్ కు లేఖ రాశారట. ఇచ్చిన నిధులను ముందు ఖర్చు పెట్టండి ఆ తరువాత నిధులు అడగండి అంటూ లేఖలో పేర్కొన్నారంటా. దీనికి కారణం కూడా లేకపోలేదట.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రతియేటా రాష్ట్రానికి రూ.1000కోట్లు కేటాయిస్తుండగా.. వాటిలో 60 శాతం కేంద్రం.. 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది విడుదల చేసిన నిధుల్లోనే ఇప్పటికీ రూ.438 కోట్లు అలాగే ఉన్నాయంటా..వీటిలో రూ.143 కోట్లను ఆర్థిక శాఖ నిలిపేసిందట. అందుకే కేంద్ర మంత్రి ఈ రకంగా లేఖ రాసి కేసీఆర్ కు పంచ్ విసిరారని అనుకుంటున్నారు. మరి మంత్రిగారి లేఖపై కేసీఆర్ సాబ్ ఎలా స్పందిస్తారో చూడాలి.