కళ్లు తెరచిన జయలలిత... వెంటిలేటర్ తొలగింపు
posted on Oct 4, 2016 @ 10:33AM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఇప్పటికే రాష్ట్రమంతటా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. గత రెండు వారాల నుండి ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి బులిటెన్ ప్రకటించలేదు నేతలు. ఒకపక్క ఆమెకు చికిత్స జరుగుతుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆమె కోలుకుంటున్నారని చెబుతున్నా.. పార్టీ నేతల్లో, అభిమానుల్లో, కార్యకర్తల్లో మాత్రం ఆందోళన అలాగే ఉంది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జయలలిత కాస్త కళ్లు తెరచి స్పృహలోకి వచ్చినట్టు.. ఆ సందర్బంగా కాసేపు వెంటిలేటర్ తొలగించినట్టు చెప్పారు. అమ్మఆరోగ్యం కాస్త మెరుగుపడిందని.. మరిన్ని రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు. దీంతో కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే అమ్మకు సంబంధించిన ఫొటోలు.. పూర్తి సమాచారం లేకపోవడంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.