మధ్యలో రాహుల్ ను ఎందుకు లాగావ్ కేజ్రీవాల్..?
posted on Jun 21, 2016 @ 5:23PM
తనకు మోడీ అంటే భయం ఉందో లేదో తెలియదు కానీ.. మధ్యలో రాహుల్ గాంధీని ఇరికించారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. వాటర్ స్కాంలో భాగంగా పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ లో కేజ్రీవాల్? పేరు నిందితుడిగా పెట్టారు. అంతే దీనిపై నిప్పులు చెరుగుతున్న కేజ్రీవాల్ కేంద్రం కేసులు పెడితే, భయపడేందుకు తానేమీ రాహుల్ గాంధీనో, రాబర్ట్ వాద్రానో కాదని అన్నారు. మోదీ తానంటే భయపడుతున్నాడని, అందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నిజాలేంటో విచారణలో తేలుతాయని అన్నారు. కాగా, 2012లో ఢిల్లీ వాసులకు నీళ్లను సరఫరా చేసేందుకు 385 వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకోగా, ఈ వ్యవహారంలో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని చెబుతూ, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కమిటీ వేయగా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు షీలా దీక్షిత్ తో పాటు కేజ్రీవాల్ నూ ఎఫ్ఐఆర్ లో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే అంతా బానే ఉంది మధ్యలో కేజ్రీవాల్ రాహుల్ ను ఎందుకు లాగినట్టో.. మరి రాహుల్ దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి.