రెచ్చిపోయిన ఖాకీ కుమారుడు...
posted on Sep 3, 2016 @ 10:47AM
అధికారం చేతిలో ఉంది కదా అని అధికారులు రెచ్చిపోవడం చూస్తూనే ఉంటాం. మరి అధికారుల సుపుత్రులు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటారు. వారు కూడా వారి తండ్రిగారి అధికారాన్ని చూపించుకొని రెచ్చిపోతుంటారు. అలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఓ ఖాకీ కుమారుడు పొట్టకూటి కోసం వాచ్ మన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై కండకావరంతో రెచ్చిపోయాడు. వివరాల ప్రకారం.. కరన్ బాగ్ లోని ఓ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మన్ గా పనిచేస్తున్న అమృత్ అనే వ్యక్తిపై రంగారెడ్డి జిల్లా పరిధిలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్ కుమారుడు పృథ్వీరాజ్ దాడికి దిగాడు. నలుగురు కానిస్టేబుళ్లను వెంటేసుకుని మరీ అమృత్ పై విచక్షణారహితంగా దాడికి దిగాడు. దీంతో అమృత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..రంగంలోకి దిగిన పోలీసులు పృథ్వీరాజ్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు పృథ్వీరాజ్ తండ్రి సీఐ వేణు గోపాల్ కూడా తన కొడుకు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.