సమైక్యవాదినే..పార్టీ నిర్ణయానికి మద్దతు:చిరు
posted on Feb 20, 2014 @ 7:40PM
రాజ్యసభలో కేంద్రమంత్రి చిరంజీవి తన తొలి ప్రసంగాన్ని తెలంగాణ బిల్లుపై చేశారు. రాష్ట్ర విభజనకు తానూ వ్యతిరేఖం అంటూనే, పార్టీ తీసుకున్న విభజన నిర్ణయానికి కట్టుబడి వున్నానని తెలిపారు. లోక్ సభలో కేంద్రం తెలంగాణ బిల్లును ఆమోదించిన తీరు దారుణమని అన్నారు. తెలుగు ప్రజల సమస్యలును అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తెలుగు ప్రజలందరినీ దిగ్బ్రాంతికి గురిచేసిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీని మాత్రమే దోషిగా చూడవద్దని, అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని గుర్తు చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర విభజన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.