కాల్ డ్రాప్కు పరిహారం ఇవ్వాలా-సుప్రీంకోర్టు
posted on May 11, 2016 @ 3:04PM
టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నపుడు మధ్యలో కట్ అయితే ఆ కాల్స్కు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. వినియోగదారులు కాల్ చేసినప్పుడు ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్డ్రాప్కు రూ.1 చొప్పున, రోజుకి రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని టెలికం కంపెనీలను ఆదేశించింది. ట్రాయ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలికం కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన సుప్రీం ఈ విధానాన్ని తప్పుబట్టింది. మధ్యలో కట్ అయిన కాల్స్కు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.