గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ నేత క్రిషాంక్ విచారణ

కంచె గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్శిటీ భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో దుష్  ప్రచారం చేసిన  కేసులో బిఆర్ఎస్ నేతలు   క్రిషాంక్, దిలీప్ లను బుధవారం గచ్చిబౌలి పోలీసులు విచారణ చేస్తున్నారు. మూడు రోజుల పాటు విచారణ ఎదుర్కోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో  కూడా వీరు నిందితులు. మార్పిడి ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను పక్క దారి పట్టిస్తున్నట్లు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు వీరిపై కేసులు నమోదయ్యాయి. ఎఐ ఫోటోలను  తయారు చేసి ప్రచారం చేసినట్లు  వీరిపై అభియోగాలున్నాయి. బిఆర్ఎస్ నేతలు కెటిఆర్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బాలివుడ్ నటుడు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టాండన్ లపై కూడా కేసు నమోదు కానున్నట్లు సమాచారం.  సెంట్రల్ యూనివర్శిటీ వద్ద ఆందోళన చేసిన 150 మందిపై ఇప్పటికే కేసు నమోదైంది. 

Teluguone gnews banner