బ్రదర్ అనిల్ కుమార్ కి కోర్టులో భంగపాటు

 

స్వర్గీయ వై.యస్.రాజశేకర్రెడ్డి అల్లుడూ, వై.యస్.జగన్మోహన్ రెడ్డి  బావగారయిన బ్రదర్ అనిల్ కుమార్ ఖమ్మం కోర్టులో వేసిన ఒక పిటిషన్నికూడా కోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. క్రీస్టియన్ మత భోదకుడిగా ప్రసిద్దుడయిన బ్రదర్ అనిల్ కుమార్, గత సాధారణ ఎన్నికల సమయంలో అంటే 2009లో ఖమ్మంలోగల కరుణగిరిచర్చిలో అతని మతభోదనలు వినడానికి వచ్చిన క్రీస్టియన్ భక్తులకు మత భోదతోపాటు, రాజకీయ ఉపదేశం కూడా చేసినట్లు తెలిసి, అది ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘనగా భావించిన రిటర్నింగ్ ఆఫీసరు దర్యాప్తుకై పోలీసులని ఆదేశించారు. వారు, బ్రదర్ అనిల్ కుమార్ తో సహా మరో ముగ్గురుపై కేసు నమోదు చేసి విచారణ చేసినప్పుడు, బ్రదర్ అనిల్ కుమార్ మినహా మిగిలిన ముగ్గురూ కోర్టు వాయిదాలకు హాజరవుతూ వస్తున్నారు. పోలీసులు, బ్రదర్ అనిల్ కుమార్ ఆచూకి కనిపెట్టకపోయినట్లు కోర్టుకి నివేదించగా, ఆతను అదే కోర్టులో తనపై అన్యాయంగా కేసు వేయబడినదని, కేసుని పునర్ విచారించావలసిందిగా పోలీసులని ఆదేశించమని కోర్టుని కోరుతూ ఒక పిటిషన్ వేయడమే గాకుండా, పోలీసులు ఎవరెవరు సాక్షులను విచారించాలో తెలుపుతూ ఒకలిస్టును కూడా కోర్టుకి సమర్పించారు. అందుకు కోర్టు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, విచారణని ఎదుర్కొంటున్న ఒక ముద్దాయి తమని ఈ విదంగా కోరడం తప్పు అని చెప్పడమే కాకుండా అతని పిటిషన్ని కూడా కొట్టి వేసింది.

Teluguone gnews banner