దారుణమైన ఓటమి: ప్రజలకు బొత్స సారీ
posted on May 17, 2014 @ 2:50PM
పీసీసీ అధ్యక్షుడిగా వున్నప్పుడు బొత్స సత్యనారాయణ మాట తీరు అందరికీ తెలిసిందే. మీడియాని కూడా తీసిపారేస్తూ, నోరేసుకుని మీద పడిపోతూ హవా నడిపించేవాడు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఆ అగ్నికి ఆజ్యం పోసిన సీమాంధ్రులలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. రాష్ట్ర విభజన సందర్భంగా బొత్స మీద ఆయన నియోజకవర్గమైన చీపురుపల్లిలోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. పరిస్థితి కర్ఫ్యూ పెట్టే వరకు వెళ్ళినా బొత్స నియోజకవర్గ ప్రజలకు ఒక్క సారీ చెప్పిన పాపాన కూడా పోలేదు. ఇప్పుడు చీపురుపల్లి ప్రజలకు బొత్స సారీ చెప్పారు. అది కూడా చీపురుపల్లి ప్రజలు చీపురు వెనక్కి తిప్పి బొత్సని కొట్టి ఎన్నికలలో ఓడించాక సారీ చెప్పారు. చీపురుపల్లిలో దారుణంగా ఓడిపోయిన బొత్స ప్రజల ముందుకు వచ్చి సారీ చెప్పారు. తాను తెలిసి ఏ తప్పూ చేయలేదని, ఒక వేళ తాను తప్పు చేశానని భావిస్తే సారీ చెబుతున్నానని అన్నాడు. చీపురుపల్లి ప్రజలు మాత్రం ‘వి హావ్ నో లారీ టు క్యారీ యువర్ బిగ్ సారీ’ అని బొత్సని పట్టించుకోవడం మానేశారు. ఇక బొత్స రాజకీయ సన్యాసం తీసుకుంటే బెటర్.