Read more!

షర్మిలతో పెళ్లికి ముందు బ్రదర్ అనిల్ మతం మార్చారు!

 

 

 

 

భారతీయ జనత పార్టీ అధికార ప్రతినిధి ఎన్.వి.ఎస్.ప్రభాకర్ బ్రదర్ అనిల్ పై దాడి కొనసాగిస్తున్నారు. మానవత్వమే మా మతమని చెబుతున్న వైఎస్ కుటుంబం..అనిల్ కి షర్మిలా తో పెళ్ళి చేసే ముందు ఆయన మతాన్ని మార్చారని, ఇదేనా మీ మానవత్వం అని ప్రభాకర్ ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు ఆయన కుమార్తె షర్మిలా ఆస్తుల విలువ రెండు కోట్ల లోపేనని..ఆ తరువాత షర్మిలా, బ్రదర్ అనిల్ లు వివిధ కంపెనీల్లో వందల కోట్ల పెట్టుబడులు ఎలా పెట్టాగలిగారని, అంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.


బ్రదర్ అనిల్ తన బినామీ బెన్ హర్ తో రక్షణ టీవి ఏర్పాటు చేయించి, అందులో కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే వందల కోట్లు ఎలా సమాకురాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్నవారి బండారాలన్ని౦టిని బయటపెడతానని చెప్పారు. అనిల్, షర్మిలాల అక్రమాస్తులను బయటకు తెచ్చేవరకూ రాజకీయపోరాటం చేస్తామని వెల్లడించారు.