అప్పుడు మోడీ విజయానికి కారణమయ్యాడు.. ఇప్పుడు ఓటమికి..
posted on Nov 10, 2015 @ 10:09AM
బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే మహా కూటమి విజయం పొంది..బీజేపీ పరాభవం పొందడానికి ఎన్నో కారణాలు ఉన్నా ప్రస్తుతం మాత్రం ఒక పేరు బలంగా వినపడుతుంది అది ఎవరో కాదు ప్రశాంత్ కిశోర్. ఒకప్పుడు మోడీ వెంట ఉండి మోడీ గెలుపుకు కారణమయిన ప్రశాంత్ కిశోరే ఇప్పుడు నితీశ్ విజయనానికి కారణమైనట్టు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్, మోడీ తరుపున ప్రచార బాధ్యతలు తీసుకొని.. ఛాయ్ పే చర్చ, సిటిజన్ ఫర్ అకౌంటబుల్ వంటి అనేక పథకాలతో ప్రచారం చేసి మోడీ గెలుపుకు కారణమయ్యాడు. అయితే తరువాత ఏమైందో ఏమో ప్రశాంత్ కిశోర్ ని నితీశ్ చేరదీశాడు. దీంతో బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ చాలా జాగ్రత్తగా వ్యూహాలు రచించి.. కనెక్ట్ టు నితీశ్ పేరుతో ఆన్ లైన్ జనతా దర్బార్ నిర్వహించి.. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. అంతేకాదు ఘర్ ఘర్ తక్ దస్తక్ కార్యక్రమం పేరుతో నితీశ్ కార్యక్రమాలు ప్రతి ఇంటికీ చేరేలా చేశాడు. ఫలితం బీహార్ ఎన్నికల్లో మహా కూటమి ఘన విజయం సాధించడం. మొత్తానికి మోడీ గెలుపుకు కారణం అయిన వాడే.. మోడీ ఓటమికి కూడా కారణం అవ్వడం గమనార్హం.