బీహార్లో జవాన్లపై దుండగుల కాల్పులు.. ఒక జవాను మృతి
posted on May 14, 2016 @ 5:17PM
బీహార్లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన జవాన్ల పై కాల్పులు జరిపారు. వివరాల ప్రకారం.. బీహార్లో వారణాసి- బక్సర్ ల మధ్య నడిచే పాసింజర్ రైల్లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అయితే వీరిని అడ్డకోవడానికి రైల్వే ప్రొటెక్షన్ షోర్స్ (ఆర్పీఎఫ్) జావాన్లు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మరణించగా.. పలువురు జవాన్లకు తీవ్ర గాయాలవ్వగా... ఒక జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం. కాగా దుండగుల కాల్పుల్లో మరణించిన జవాను అభిషేక్ సింగ్ అని..తీవ్రగాయాలైన మరో జవాను నంద్ లాల్ యాదవ్ అని రైల్వే అధికారులు చెప్పారు.