కేంద్రమంత్రిపై కేసు : పదవి ఉక్కు.. పెదవి తుక్కు!
posted on Apr 8, 2014 @ 5:34PM
కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా బేణీ ప్రసాద్ వర్క పేరుకే ఉక్కు మంత్రి గానీ, ఆయన నోరు తెరిచారంటే తిట్ల పురాణమే. దేశ రాజకీయాలలో నోరేసుకుని బతికిపోతున్న అనేక మంది రాజకీయ నాయకులలో బేణీ ప్రసాద్ వర్మ కూడా ఒకరు. అందర్నీ తిట్టినట్టే వర్మ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని కూడా తిట్టారు. ఆయన మోడీని ‘బిగ్గెస్ట్ గూండా ఆఫ్ ఆర్ఎస్ఎస్’ అని తిట్టారు. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మోడీ దగ్గర బానిసలా పనిచేస్తున్నాడని నోరు పారేసుకున్నారు. అలా నోరు పారేసుకున్నదానికి రియాక్షన్ వచ్చేసింది. బేణీ ప్రసాద్ వర్మ ఎన్నికల కోడ్ను అతిక్రమించారని అధికారులు బలరాంపూర్లో కేసు నమోదుచేశారు. అయినా బేణీ ప్రసాద్ వర్మకి ఇలా ఎన్నికల కేసులలో ఇరుక్కోవడం మామూలే. పరిమితికి మించి వాహనాలు ఉపయోగించినందుకు కూడా ఆయన మీద కేసు నమోదైంది.