కేసీఆర్ గతంలో పాస్పోర్ట్ బ్రోకర్! సంజయ్ హాట్ కామెంట్స్
posted on Nov 11, 2020 @ 4:11PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ గతంలో పాస్పోర్ట్ బ్రోకర్ అని విమర్శించారు. నిజామాబాద్లో కేసీఆర్ బిడ్డను.. దుబ్బాకలో అల్లుడిని ఓడించామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ బాక్స్ బద్దలు కొడతామని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు చెంచాగాళ్లు.. ఎందుకా బతుకు బతుకుతున్నారంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు సంజయ్. కేసీఆర్ బీసీలను అణగదొక్కుతూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని తప్పుబట్టారు. బీసీలపై ప్రేమ ఉంటే టీఆర్ఎస్కు బీసీని అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. దుబ్బాక ప్రజల స్ఫూర్తితో గ్రేటర్ ప్రజలు బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ అభ్యర్ధించారు.