పోలింగ్ శాతం తగ్గేలా టీఆర్ఎస్ కుట్ర.!
posted on Dec 1, 2020 @ 5:00PM
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి టీఆర్ఎస్సే కారణమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని, పోలింగ్ శాతం తగ్గేలా టీఆర్ఎస్ కుట్ర చేసిందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీపీఐ, సీపీఎం గుర్తు ఏదో కూడా తెలియకుండా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్ ను సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్, మంత్రులు తప్పుడు ప్రకటనలతో ప్రజలను భయపెట్టారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మతాన్ని బూచీగా చూపి తప్పుడు ప్రచారం చేశారు. మతకలహాలు జరుగుతాయంటూ ప్రజలను భయపెట్టారని అన్నారు. అనుకూలమైన ఉద్యోగులకే ఎన్నికల డ్యూటీ వేశారని ఆరోపించారు. అడ్డదారి, అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేశారని, ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అన్నారు. బీజేపీ మేయర్ గెలవబోతోంది అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.