Read more!

'శివసేనాధిపతి' బాల్ ఠాక్రే కన్నుమూత

 

 

శివసేన అధినేత బాల్ ఠాక్రే కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు బాల్ ఠాక్రే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న థాకరే జులైలో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. అయితే సుమారు రెండు నెలల క్రితం మాతోశ్రీకి ఆయనను తరలించారు.

శనివారం మధ్యాహ్నం బాల్ ఠాక్రే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచారు. బాల్ ఠాక్రే మృతి చెందినట్లు తెలిసిన అభిమానులు ఆయన అధికార నివాసం మాతోశ్రీకి భారీగా తరలివస్తున్నారు. దీంతో భారీగా బలగాలను మోహరించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బాల్ థాకరే అంత్యక్రియలు జరగనున్నాయి.