వారి చెంప చెళ్లుమనిపించాలి.. ప్రత్యేక హోదాపై శివాజీ ఘాటు వ్యాఖ్యలు
posted on May 14, 2016 @ 4:41PM
ఏపీకి ప్రత్యేక హోదా కోటీశ్వరుల కోసం కాదని.. భావి తరాల కోసం.. విద్యార్ధుల కోసం అడుగుతున్నామని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమైఖ్య సంఘ అధ్యక్షుడు శివాజీ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఉద్యమానికి పార్టీలతో సంబంధం లేదు..ప్రత్యేక హోదా వచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది...తెలంగాణ రాష్ట్రం ఎలా సాకారమైందో.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది అని అన్నారు. ఏపీని కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువ ముంచింది.. బీజేపీకి ఏపీలో మొహం చెల్ల్లే అవకాశం లేదు.. తమిళనాడు, కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి తెలుగు ప్రజలు బుద్ది చెప్పాలి అని సూచించారు. టీడీపీ పార్టీ పై భజన చేయడం.. వైసీపీ పై విమర్శలు చేయడం మా పని కాదు అని అన్నాడు..పోరాడి, ప్రత్యేక హోదా సాధించుకుంటాం.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరంలేదన్న వారి చెంప చెళ్లుమనిపించాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.