Read more!

వాయు కాలుష్యంతో మీ మెదడుకు ముప్పు....

వాయు కాలుష్యం వల్లే కేంద్ర నాడీ మండలం పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు గుర్తించారు.
శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో మనిషి మెదడులో రకరకాల రాసాయానాలు రేణువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే రకరకాల బ్రెయిన్ డిజార్డర్స్ కు కారణం అవుతుందని గాలిద్వారా మనశరీరంలోకి పలురకాల టాక్సిన్స్ మెదడులోకి చేరుత్జున్నాయి. మనం నివసించే ప్రాంతం పూర్తిగా వాయుకాలుష్యం తో నిండి ఉందని వాటిని మనం పీలుస్తూ ఉంటె అవి మన ఊపిరితిత్తుల ద్వారా రక్తనాళాల ద్వారా  చేరుతుంది. అది మెదడులో రకరకాల బ్రెయిన్ డిజార్డర్స్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయని . మెదడులో బ్రెయిన్ డ్యామేజ్ కు కారణ మౌతుందని ఒక నూతన పరిశోదన వెల్లడించింది. 

శాస్త్రజ్ఞులు నేరుగా వివిధ మార్గాల ద్వారా పేరుకు పోయిన రేణువులు రాసాయానాలను రక్త నాళాల ద్వారా చేరిన రేణువులు మెదడులో నిలిచి ఉంటాయి. ఇతర శరీర అవయవాల లో తిష్ట వేసి ఉండడాన్ని గుర్తించారు.బిర్మిగామ్ విశ్వ విద్యాలయానికి చెందినా అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశోధనల  కొన్ని  అంశాలను ప్రచురించింది. శాస్త్రజ్ఞులు మెదడులో కొన్ని రకాల రేణువులు రాసాయనాలు ఉన్నట్లు రోగుల నుండి వాటిని సమీకరించారు.వారిలో కొన్ని రాకా;ల బ్రెయిన్ డిజార్డర్స్ వాటిని  కప్పి ఉంచడం సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు.

బెర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ ఇసుల్ద్ లించే పరిశోదన పై  కొన్ని విమర్శలు చేసారు. వైద్య విజ్ఞానం లో చాలా తేడా  ఉందని వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకరమైన రేణువులు కేంద్ర నాడీమండలం పై ప్రభావం చూపిస్తుంది. మెదడులో పేరుకు పోయిన రేణువులు ఉండడం వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.  అది శరీరం లో ని ఇతర భాగాల లోనూ చేరుతుందని నిపుణులు గుర్తించారు. రక్తం గుండా 8 రకాల రేణువులు మెదడులో ప్రవేసిస్తాయి. అందిన సమాచారం ప్రకారం ముక్కుద్వారా శ్వాస నాళాల లోకి చేరి గాలిలో ఉన్న కాలుష్యం ద్వారా మెదడుకు 
చేరిన రేణువులు మెదడుపై ప్రభావం చూపుతాయి. గాలి కాలుష్యం లోనే అన్నిరకాల రాసాయానాలు రేణువులు,దుమ్ము,ధూళి,ఉంటుందని మొత్తంగా పర్టిక్యులేట్ మేటర్ గా చేరి మెదడుపై ప్రభావం చూపి సమస్యలకు  కారణం అవుతున్నాయి.ఆల్ట్రా ఫైన్ పార్టికల్స్ శరీరం నుండి తప్పించుకుంటున్నాయి. రోగనిరోదక శక్తి నిచ్చే కణాలు బయోలాజికల్ బారియర్స్ అడ్డంకులు ఉంటున్నాయి ఇటీవలి పరిశోదనలో అత్యంత ప్రభావవంతమైన కాలుష్యం మెదడులో వాపు అల్జీమర్స్ కాగ్నేటివ్ సమస్యలకు దారితీస్తుంది.ఈ రకమైన సమస్యలు పెద్దల లోనేకాదు పిల్లల లోనూ వేదిస్తుంది.

మనం పీలుస్తున్న  వాయు కాలుష్యం రక్తం ద్వారా ప్రవహించి రక్తనాళాల ద్వారా ఏర్పడిన అడ్డకులను సైతం తోసి మెదడులోకి చేరుతుంది. రక్తనాళాల లోకి చేరుతుంది. రక్త నాళా లను నాశనం చేరడం. చుట్టుపక్కల ఉన్న కణాలను నాశనం చేయడం జరిగిపోతుంది. మెదడును చేరిన రేణువులు చాలా గట్టిగా ఉండడం వల్ల కరగడం అసాధ్యం ఈ కారణంగా అవిమేదడులో దీర్ఘకాలం పాటు ఉండిపోతాయి.వాయు కాలుష్యం వల్లే కేంద్ర నాడీ మండలం పై ప్రభావం చూపుతుందని గుర్తించారు. దీని పై మరిన్ని పరిశోదనలు అవసరమని ఈమేరకు మెదడులో ఎలాంటి రేణువులు వచ్చి చేరుతున్నాయో అవి ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది కూడా నిశితంగా పరిశీలించడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు.