అద్వానీకి లోక్ సభ వీడ్కోలు!
posted on Feb 22, 2014 @ 10:11AM
భారతీయ జనతా పార్టీ కులగురువు, రాజకీయ బీష్ముడు 87ఏళ్ళ అద్వానీ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారా? లోక్ సభ సమావేశాలలో ఆఖరి రోజు జరిగిన సన్నివేశాలు చూస్తుంటే ఇది నిజమేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు! 15వ లోక్ సభ సమావేశాల చివరి రోజు సభలో అద్వానీ అందరూ పొగడ్తలతో ముంచెత్తుతూ దాదాపు వీడ్కోలు స్థాయిలో ప్రశంసిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సభలో భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. సభలో సభ్యులందరూ ఆయన్ని 'ఫాదర్ ఆఫ్ ది హౌస్' గా అభివర్ణించారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానంటూ సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ''అద్వానీజీ మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను...పార్టీ బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేసిన మీరు..పార్టీ బలోపేతం అవుతుంటే..మీరు బలహీనమవుతున్నారు'' అని ములాయంసింగ్ యాదవ్ అన్నారు.