Read more!

స్థానిక ఎన్నికలు: బ్యాలెట్ పేపర్ మింగేసిన ప్రబుద్ధుడు

 

 

 

పోలింగ్ బూత్‌ల్లో రకరకాల విచిత్రాలు జరుగుతూ వుంటాయి. ఓటర్లని ప్రభావితం చేయడం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకులు పోయడం, రిగ్గింగ్ చేయడం... రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇలాంటి కళలు ఎన్నో ప్రదర్శిస్తూ వుంటారు. ఆ కళల్లో ఒక కళని అనంతపురం జిల్లాలో పోలింగ్ ఏజెంట్ పనిలో వున్న ఓ పార్టీ కార్యకర్త ప్రదర్శించాడు. ఆ కళ బ్యాలెట్ పేపర్ని అప్పడంలా నమిలి మింగేయడం. ఒక ఓటరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడాన్ని గమనించిన మరో పార్టీకి చెందిన ఆ వ్యక్తి ఓటరు దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ని లాక్కున్నాడు. ఓటర్ దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ ఎందుకు లాక్కున్నావ్? అంటూ అతని దగ్గరి నుంచి బ్యాలెట్ పేపర్ని తీసుకోవాలని అక్కడున్న అధికారులు ప్రయత్నించారు. దాంతో అతగాడు బ్యాలెట్ పేపర్ని నమిలి మింగేశాడు. అసలు ఇప్పుడేమైంది? నేను ఓటర్ దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ లాక్కున్నానని ఎలా నిరూపిస్తారని ప్రశ్నించాడు. అతగాడి అతి తెలివి చూసి అధికారులు నెత్తీనోరూ బాదుకున్నారు.