Read more!

స్థానిక ఎన్నికలు: జగన్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు

 

 

 

స్థానిక ఎన్నికలలో పైచేయి సాధించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతకైనా తెగించేట్టున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా సదరు పార్టీ నాయకుల దౌర్జన్యకాండ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాలో వైసీపీ నాయకులు దౌర్జన్యాల పరంపరను కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కర్నూలు జిల్లాలోని దేవరకొండ మండలం కప్పట్రాళ్ళలో వైసీపీ కార్యకర్తలు తమ విశ్వరూపాన్ని చూపించారు. పోలింగ్ బూత్ దగ్గర వున్న టీడీపీ ఏజెంట్‌ని చావగొట్టి చెవులు మూసి అక్కడి నుంచి బయటకి పంపేశారు. ముఖ్యంగా రాయలసీమలోని పలు పోలింగ్ కేంద్రాలలో వైసీపీ నాయకులు ఏదో ఒక హడావిడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలలో తమ అడ్రస్ గల్లంతైపోతుందన్న భయంతోనే వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.