Read more!

బిజెపి పై షిండే సంచలన వ్యాఖ్యలు, క్షమాపణకు డిమాండ్

 

 

 

 

జైపూర్‌లోని కాంగ్రెసు పార్టీ చింతన్ శిబిర్‌లో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి,ఆర్ఎస్ఎస్ హిందూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. సంఝౌతా ఎక్సుప్రెస్, మక్కా మసీదు, మాలేగామ్ పేలుళ్ల వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని ఆయన ఆరోపించారు. బిజెపి, ఆర్ఎస్ఎస్‌లు హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని తాను ఏదో కొత్త విషయం చెప్పలేదని, ఉన్న విషయాన్నే చెప్పానని అన్నారు.


షిండే వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. షిండే వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై కాంగ్రెసు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆయన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలన్నారు. షిండే వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు.