మోడీని కలిసిన అజిత్ ధోవల్.. తేలికగా తీసుకోవద్దు..
posted on Oct 3, 2016 @ 1:18PM
భారత్ సైన్యం చేసిన దాడులకు పగతో రగిలిపోతున్న పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. గత రాత్రి బారాముల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్ పై ఫిదాయీల దాడి చేసిన ఉగ్రవాదులు.. ఇప్పుడు పూంఛ్ సెక్టారులో సైనికులపై కాల్పులు జరిపారు. అయితే పాకిస్థాన్ చేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై మాట్లాడేందుకు ప్రధాని నరేంద్రమోడీని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కలిశారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోడీ అన్ని అధికారాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎటువంటి చొరబాటు, ఉగ్రదాడి, సరిహద్దులకు ఆవలి నుంచి కాల్పులు వంటి ఘటనలను తేలికగా తీసుకోవద్దని, గట్టిగా స్పందించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇంకా బారాముల్లాలో కాల్పులు నేపథ్యంలో పారిపోయిన ఉగ్రవాదులను కూడా పట్టుకోవాలని.. లేకపోతే ఎన్ కౌంటర్ చేయాలని ఆదేశించారు.