Read more!

వైయస్ జగన్ పార్టీలోకి ఎమ్మెల్యే సాయిరాజ్

 

 

 

శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇచ్ఛాపురం శాసనసభ్యుడు సాయిరాజ్ జగన్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ని ఈ రోజు టిడిపి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ ములాకత్ సమయంలో కలిశారు. సాయిరాజ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్ రావు, ఇచ్ఛాపురం టిడిపి ఇంఛార్జ్ వెంకటరమణలు కూడా జగన్ ని కలిశారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి సమక్షంలో సాయిరాజ్ వైఎస్ఆర్ సీపీలో తీర్థం పుచ్చుకోనున్నారు.


ఇచ్చాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే సాయిరాజ్ చిత్రమైన కధ చెప్పారు.తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణించిన తర్వాత తాను రాజకీయంగా ఇబ్బందిలో పడ్డానని, పార్టీ పరిస్థితులు మారిపోయి, తాను రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు.