"కూడూ, గుడ్డా తప్ప జీవితంలో ఇంకేమీ లేవా?"
"ఎందుకు లేవూ? గుఱ్ఱపు పందేలున్నాయి. ఎంత సరదాగా ఉంటుంది? వస్తే లక్షలోస్తాయి."
"లేకపోతే చిప్ప చేతికొస్తుంది"
"వస్తే వస్తుంది. జీవితంలో కష్టపడి సంపాదించి ఏనాటికి. ఐశ్వర్యవంతులం కాగలం? అదృష్టం కలిసొస్తే ఇలాగే రావాలి."
"ఒక్కటి మరిచి పోతున్నారు. అదృష్టమనేది మనసు వెతుక్కుంటూ వచ్చేది. మనం వెతుక్కుంటే దొరికేది కాదు."
"అదృష్టం సంగతేమో కాని, ఐశ్వర్యం మాత్రం మనం సాధించి పొందవలసిందే!"
ఆ మాటలతో ఆసక్తిలేని సుశీల తిరిగి పుస్తకంలో తలదాచుకుంది.
"నేనూ చదువుతాను పుస్తకాలు. కానీ ఇలాంటి చెత్త పుస్తకాలు చదవను. మంచి మంచి పుస్తకాలు చదువుతాను."
పుస్తకాలలో ఆసక్తిగల సుశీల చిటుక్కున తలెత్తి "ఏం పుస్తకాలు?" అంది.
"ఖాతా పుస్తకాలు. వద్దు పుస్తకాలు, లాటరీ పజిల్స్, చెక్ పుస్తకాలు........"
"పకపక నవ్వింది సుశీల.
అప్పుడే లోపలకు వచ్చిన రాజారావు సుశీల నవ్వు చూసి "ఏవిటి నవ్వుతున్నావ్?" అన్నాడు.
"మీ స్నేహితుడు అత్యంత ఉత్తమ సాహిత్యమంటే ఏమిటా చేపుతాన్నారు. వింటే నవ్వాగలేదు."
"ఏమిటి?"
"ఖాతా పుస్తకాలు!"
రాజారావు పెదవులపైన చిరునవ్వు విరిసింది సుశీల గడియారం చూసుకుని విముక్తిపొందిన దానిలా లేచి "అన్నయ్యా! నేను సంగీతం క్లాసు కెళ్ళాలి. టైమయిపోతోంది." అంది.
"వెళ్ళిరా!" అన్నాడు రాజారావు.
"ఎందుకండీ, ఆడపిలల్లకు సంగీతం? కూడు పెడుతుందా? గుడ్డ పెడుతుందా? అంతకన్న ఇంట్లోపనిపాటలు నేర్చుంకుంటేమేలు!"
రాజారావుముఖం గంభీరం కావటంచూసి తను పొరపాటుగా మాట్లాడానని నొచ్చుకున్నాడు, రమణరావు.
సుశీల సహించలేకపోయింది.
"లాలితకళలు కూడూ, గుడ్డా పెట్టావు. నిజమే! కాని మనసు కొక మధురమైన ఆనందాన్ని కలిగిస్తాయి. గుఱ్ఱపు పందేలూ, లాటరీలు తప్ప మరొకటి తెలియని వాళ్లకి ఆ ఆనందం అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం లేదు. అది వాళ్ల దురదృష్టం !"
"సుశీలా!" అన్నాడు రాజారావు మందలిస్తున్నట్లు _ _
సుశీల మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది.
4
ఆరోజే అనిత వస్తోంది. శారదమ్మ ఒకటే హడావుడి పడ్తోంది. చాలా రోజుల తర్వాత ఆవిడ మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. శారదమ్మకు దగ్గిర దగ్గిర సంవత్సరం క్రిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
తలవని తలంపుగా వచ్చిన అన్నను చూసి ఆశ్చర్యపోయింది శారదమ్మ.
పిచ్చిదానిలా చూస్తోన్న శారదమ్మను చూసి ఆప్యాయంగా తల నిమురుతూ "నేనే శారదా! ఏమిటలా చూస్తావ్?" అన్నాడు దయాశంకర్ నవ్వుతూ.
"అన్నయ్యా! నువ్వేనా? వచ్చావా? ఏన్నాళ్లకు కానీపించావ్ ?"
పెదవులపై చిరునవ్వు, కళ్లలో కన్నీళ్ళు చిందిస్తూ అంది శారదమ్మ.
"ఎప్పుడో వచ్చేవాణ్ణి. మీరు రానిస్తే ......"
శారదమ్మకు కలుక్కుమంది. సమాధానం చెప్పలేని స్థితిలో తల వంచుకుంది.
దయాశంకర్ ఒక ఆంగ్లో ఇండియన్ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజుల్లో అది బంధువర్గంలో పెద్ద దుమారం రేపింది.
భార్యను తీసుకుని చెల్లెలి ఇంటికి వచ్చాడు దయాశంకర్.
లక్ష్మీపతి వీధి తలుపులు వేసేసి "నేను పరువు ప్రతిష్ఠలతో బ్రతుకుతున్నవాడిని. నీ ఇష్టమొచ్చినట్లు నువ్వు ఊరేగు. నా ఇంట్లో మాత్రం అడుగుపెట్టకు. నా బ్రతుకు బజారుపాలు చెయ్యకు" అన్నాడు.
తనదైన వ్యక్తిత్వం ఏనాడో చంపుకున్న శారదమ్మ బొమ్మలా నిలబడి పోయింది.
తన భార్యతో వీథిలోంచే తిరిగి వెళ్ళిపోయిన దయాశంకర్ ఇరవై ఏళ్ళ తరువాత తిరిగి ఆ ఇంటికి వచ్చాడు.
"వదినను తీసుకొచ్చావా?"
"మీ వదిన నీ కసలు తెలియదు గనుక ఈ ప్రశ్న అడిగావు. ఆవిడ కెంత ఆత్మాభీమానమో తెలుసా? ఆ కంఠంలో ప్రాణం ఉండగా తనను అవమానించిన ఇంట్లో అడుగు పెడుతుందా? ఆవిడను పై లోకానికి సాగనంపాకే ఇక్కడికి వచ్చాను."
ఈ మాటలంటున్నప్పుడు దయశంకర్ కంఠం సన్నగా వణికినా పెదవులు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి,
శారదమ్మ ఈ మాటలు విని నిజంగానే నొచ్చుకుంది.
తన అన్నగారి జుట్టు అంతాగా నెరిసిపోవటానికి, ముఖం బాగా ముడతలు వడటానికీ వృద్దాప్యం కారణం కాదని అప్పుడు అర్థమయింది.
"అయ్యయ్యో! అన్నయ్యా! పాపం, నీకు ...."
దయాశంకర్ చేయెత్తి చెల్లెల్ని వారించాడు.