Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 17


  

       బొడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెకు ప్రత్నామ్నాయ పదం దొరకలేదు. అలా ఆలోచిస్తుంటే నాభి అన్న పదం గుర్తుకొచ్చింది. కొత్తపదం తట్టిందన్న ఆనందంతో చెప్పబోయి అందులోనూ రెండు అక్షరాలే వున్నాయన్న విషయం స్ఫురించి ఆగిపోయింది.

 

    ఇక లాభం లేదని మెల్లగా "బొడ్డు" అని, "వత్తులుంటే కన్సొలేషన్ ముద్దులు పెట్టుకోవచ్చు కదా" అంది.

 

    అతను నవ్వుతూ "అలా కుదరదు" అని రెండుసార్లే పెదవులతో అద్దాదు.

 

    "నెక్ట్సు" అన్నాడు  తల పైకెత్తి  ఆమె కళ్ళల్లోకి చూస్తూ.

 

    "నెక్ట్సు ఏమీలేదు" సిగ్గువల్ల ఆమె కంఠం సన్నగా పలికింది.

 

    అతను దానికి ఒప్పుకోనట్లు తల అడ్డంగా తిప్పాడు.

 

    ఆపై కొనసాగించడానికి ఇష్టంలేదు. కానీ అతను మరీ బలవంతం చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తెలియక స్వగతంగా అనుకుంటున్నట్లు "అయ్యో! భగవంతుడా" అంది.

 

    "అంటే మూడు అక్షరాలన్నమాట" అని కిందికి వంగాడు.

 

    తను చెప్పిన భగవంతుడికీ, అతను అన్న మూడు అక్షరాలకి సంబంధం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అర్థమయ్యేలోపు మూడు ముద్దులూ పెట్టి లేచాడు.

 

    అతను ఆమెను గాఢంగా హత్తుకుని, శరీరంమీద పెదవులతో ముద్రలు వేస్తున్నాడు.

 

    నుదుటున పెట్టుకున్న ముద్దు పచ్చ గన్నేరై, కళ్ళమీద పెట్టుకున్న ముద్దు కనకాంబరమై, పెదవుల మీద పెట్టుకున్న ముద్దు ముద్దమందారమై, వక్షం మీద పెట్టుకున్న ముద్దు బొండుమల్లెలై మొత్తం తన శరీరమే కదంబ పూలదండైనట్లు ఆమె పులకించిపోయింది.

 

    అతనిలో కలిసిపోవాలన్న కోరికతో అంగుళం మేర మొత్తం శరీరాన్నంతా పైకి లేపి తనలోకి అదుముకుంది అతన్ని.

 

    వాళ్ళిద్దరి సమాగమానికి కాలం కాపలాగా నిలిచింది.

 

    మరో గంటకు ఆమె ఇంటికి బయల్దేరింది.

 

    ఆ పౌర్ణమి వెళ్ళిన సరిగ్గా పదిహేను రోజులకి ఆమె భర్తకి లాటరీలో పాతికవేల రూపాయలు వచ్చాయి. పరంధామయ్య నడుం నొప్పి తగ్గింది. అనసూయమ్మ పంటినొప్పి పటాపంచలైంది!

 

    ఇలా ఇంట్లోని వాళ్ళందరికీ ఏదో ఒక లాభం చేకూరింది.

 

    ఆ రాత్రి చలపతి లహరి పక్కన చేరాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆమెను తనవైపు తిప్పుకుని "నువ్వు గోపాలకృష్ణతో గడిపాక ఇంట్లోని అందరికీ  మేలు జరిగింది. మరి అసలు కథానాయిక అయిన నీకు ఏమొచ్చింది?" అని అడిగాడు.

 

    ఆమె మళ్ళీ యథాప్రకారం గోడవైపు తిరుగుతూ చెప్పింది-

 

    "కడుపు."

 

                                             6

 

    ఉదయం అయిదు గంటలైంది. ఇంకా తూర్పు తలుపు తెరుచుకోనట్లు చీకట్లు అంతర్థానం కాలేదు. పక్షులు అప్పుడే నిద్రలేచి ఒకదాని కొకటి శుభోదయం చెప్పుకుంటున్నట్లు మెల్లగా అరుస్తున్నాయి. గాలి మార్నింగ్ వాక్ కి బయల్దేరినట్లు చిన్నగా వీస్తోంది.

 

    పంతులు దేవాలయం ఆవరణలో వున్న బావి దగ్గిరికి చేరుకున్నాడు.

 

    అతను మన్మథ దేవాలయం అర్చకుడు. వయసు ముప్ఫై అయిదు దాకా వుంటుంది. తన ఇరవై ఎనిమిదవ ఏట అర్చకత్వాన్ని స్వీకరించాడు. ఆలయంలోని అర్చకుడు విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.

 

    స్త్రీలు టాప్ లెస్ గా దేవుడ్ని దర్శించుకోవాలన్న నియమం వున్న దేవాలయంలో అర్చకుడు ఘోటక బ్రహ్మచారిగా వుండాల్సి రావడం నరకం. ఆ విషయం అతను అర్చకత్వంలోకి ప్రవేశించిన మొదటిరోజే అర్థమైంది. అంతకు ముందున్న అర్చకుడు ఎందుకు నలభై ఏళ్ళకల్లా పిచ్చివాడైపోయి దేశాలు పట్టి పోయాడో కూడా బోధపడింది. అర్చకత్వం తప్ప మరో జీవనాధారం లేదని తెలియడం వల్ల విధిలేని పరిస్థితుల్లో అక్కడ చేరాడు.

 

    గబాగబా నాలుగు బిందెల నీళ్ళను ఒంటిమీద కుమ్మరించుకుని తువ్వాలుతో తుడుచుకున్నాడతను. అంతక్రితం రోజు ఉతికి పెట్టుకున్న పంచెను  బిగించి కట్టుకుని గర్భగుడిలోకి వెళ్లాడు.

 

    దేవుడికి అభిషేకం చేసి అలంకరించాడు.

 

    పూలమాల కోసం ఎదురుచూస్తూ బయటికొచ్చి కూర్చున్నాడు.

 

    మరో అయిదు నిముషాలకు  మోహన అక్కడికి వచ్చింది. ఆమెకు  ముప్ఫై  ఏళ్ళుంటాయి. పెళ్ళయింది. దేవాలయపు పరిచారిక.

 

    ఉదయం వచ్చి దేవాలయాన్ని శుభ్రపరచడం, పంతులుకి చేదోడు వాదోడుగా వుండటం ఆమె విధులు. ఇందుకోసం ఆమెకు  రెండెకరాల మాగాణిని ఇచ్చారు. అందులో వచ్చే ఫలసాయాన్ని ఆమె పరిచారికగా వున్నంత కాలం అనుభవించవచ్చు.

 

    దేవాలయంలోకి అడుగుపెట్టగానే ఆచారం ప్రకారం ఆమె  పైటను తీసి బొడ్లో దోపుకుంది.

 

    అటువైపు చూడకూడదని పంతులు మనసును ఎంత డైవర్ట్ చేసుకున్నా వీలుకాలేదు. చూపులు ఆమె ఎదపై  పడ్డాయి. నిజానికి ఆమె ఎద వుండాల్సిన  దానికన్నా ఎత్తుగా వుంటుంది. ఆమె యవ్వనమంతా ఆ రెండు అవయవాల్లోనే కూరుకుపోయినట్లు వుంటుంది. తన మనసును ముక్కలు ముక్కలుగా చేయడానికి ఫిరంగుల్లా వాటిని సంధించినట్టనిపించి గింజుకు పోయాడు అతను.

 

    ఇంకాసేపు అలా చూస్తే తన కళ్ళు పెళ్ళిపోతాయేమోననిపించి చూపులను కిందకు వాల్చాడు.

 

    "ఇదిగోండి పూలమాల దేవుడికి. పూలకోసం విడిపూలు కూడా వున్నాయి చూసుకోండి" అంటూ పూలబుట్టను చేతికందించింది.
    

    అలవాటైన చూపులు పైకి ఓ మారు ఎగబాకి తుంటరి కోతి ఈ  కొమ్మనుంచి ఆ కొమ్మకు దూకినట్లు అటూ ఇటూ పాకాయి.

 

    స్త్రీలు పైట తీసి దేవుడ్ని దర్శించుకోవాలన్న నియమం వున్న ఇలాంటి దేవాలయంలో పూజారి బ్రహ్మచారిగా వుండాలన్న నిబంధన పెట్టినవాడ్ని పిలకపట్టుకు లాగి తన్నాలన్న కోపం వచ్చిందతనికి. తన కోపాన్ని దిగమింగు కుంటూ పూజలో నిమగ్నమయ్యాడు. మంత్రాలు చదువుతూ దేవుడ్ని పుష్పమాలా లంకృతుడ్ని చేశాడు.

 

    మోహన దేవాలయాన్నంతా చీపురుతో చిమ్మి వాకిట దేవాలయ ప్రాంగణంలో ముగ్గులు పెడుతోంది.

 

    అంతలో తొలిభక్తురాలిగా ఓ ముదుసలి వచ్చింది. ఆమెకి డెభ్బై ఏళ్ళ పైమాటే. వస్త్తోనే పైటను బొడ్లో దోపుకుని గర్భగుడి ముందు నిలబడి రెండు  చేతులూ జోడించింది. పంతులు ఆమెను చూశాడు.

 

    ఆమె ఎద అంతా ఎండిపోయి, ఒకప్పుడు  వయసుతో మిడిసిపడ్డ ఆ చోటు ఇప్పుడు కాలం మీద పోరాడి అలిసిపోయి డస్సిపోయినట్లు కనిపించాయి.

 

    యవ్వనవంతులైన స్త్రీలు వస్తే ఒక బాధ. వయసుపైబద్ద వాళ్ళు వస్తే మరో బాధ. ఆమె ఎదను చూడగానే పంతులుకి జీవితం మీద మమకారం సగం చచ్చిపోయింది.

 Previous Page Next Page