Read more!

శతానీకుడు (Sataneekudu)

 

శతానీకుడు (Sataneekudu)

 

జనమేజయుని కుమారుడు శతానీకుడు. శాతానీకునికి ఇద్దరు భార్యలు. ఇతనికి సంతానం కలగకపోవడంతో శాండిల్య మహాముని ఆధ్వర్యంలో ఇతడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఈ యాగం వల్ల సహస్రానీకుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చి, ఇతడిని సహాయం కోసం రావలసిందిగా కోరతాడు. రాక్షసులతో జరిగిన యుద్ధంలో శతానీకుడు మరణిస్తాడు. ఇతని భార్యలు సహగమనం చేస్తారు. దేవతలకూ, రాక్షసులకూ జరిగిన యుద్ధాలలో మానవజాతికి చెందినా రాజులు దేవతలకు సహాయం చేయడం సహజమే. పురాణాల ప్రకారం చూసినప్పుడు అలా జరిగిన యుద్దాలలో రాక్షసుల చేతిలో మరణించిన ప్రముఖ రాజు శతానీకుడు.