Read more!

Krupudu

 

కృపుడు

Krupudu

 

శరద్వంతుని కుమారుడు కృపుడు. అతని చెల్లెలు కృపి. శరద్వంతుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో జన్మించిన వీరిద్దరినీ శంతనుడు చేరదీసి పెంచుతాడు. తపస్సు పూర్తయిన శరద్వంతుడు కృపుడికి ధనుర్విద్య నేర్పిస్తాడు. కృపికి ద్రోణాచార్యునితో వివాహం చేస్తాడు. సాత్విక స్వభావం కలిగిన కృపుడు ద్రోణాచార్యునీతో బాటు దుర్యోధనుని కొలువులో ఆచార్యునిగా ఉన్నాడు. ఎన్నడూ దుర్యోధనునికి ఎదురుచెప్పక అతడికి అనువర్తనగా ఉండేవాడు. అయితే మరీ అత్యవసర సమయాలలో మాత్రం హితవచనాలు చెప్పేవాడు. ధనుర్విద్యలో నిపుణుడు అయినప్పటికీ భీష్ముడు, ద్రోణుడు వంటివారి వల్ల ఇతని శౌర్యం పూర్తి స్థాయిలో బయటపడవలసిన అవసరం ఎన్నడూ కలగలేదు.