Read more!

అయ్యప్ప మాల ప్రాముఖ్యత ఏమిటి

 

 

అయ్యప్ప మాల ప్రాముఖ్యత ఏమిటి?

 

 

మన పూజా విధానంలొ జపమాలగా ఉన్నత స్థానాన్ని పొందిన కంఠాభరణాలు తులసి, రుద్రాక్ష, చందనం, స్పటికం, పగడాలు తామర పూసల మాలలు. రుద్రాక్షలు అనేవి అ పరమేశ్వరుడు ఐన శివుని అంశ వలన ఉద్భవించినవిగా ప్రతీక. అందువలన రుద్రాక్షల మాలలు అన్నింటిలొ శ్రేష్టమైనవిగా చెప్పుకుంటాము. రుద్రాక్షల వలన రుద్రాక్షలు ధరించటం వలన మనకు చాలా మంచి ఫలితాలు అనగా భూత పిశాచ భాధలు తొలుగుతాయి అంతేకాక మన ఆరోగ్యానికి కూడా ఎంతొ మంచిది. రుద్రాక్ష అధిక కొపాన్ని తగ్గించి బి.పిని కంట్రోల్ చేస్తుంది ఏన్నో ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి మాల విష్ణుమూర్తికి ప్రతీక. ఈ మాల ధరించటం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. చందన మాల శరీరానికి తాపనివారిణిగా పనిచేస్తుంది. స్ఫటికమాల మాలిన్యాలను గ్రహిస్తుంది. పగడమాల వలన రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తామర పూసల మాల చర్మ వ్యాధులను దరిచేరనివ్వదు. అందుకే ఈ పరమ పవిత్రమైన మాలలకు పూజ, అభిషేకం చేసి, ఆ మాలల యందు అ అయ్యప్ప స్వామిని ఆవహింపచేసి వాటిని ధరించి భక్తులు అందరూ శుధ్ధిగా దీక్ష తీసుకుంటారు.