Read more!

cristmas special cake

 

 

 

క్రిస్మస్ కేక్ 

 

 

కావలసిన పదార్థాలు:
వెన్న - చిన్న కప్పు 
చక్కెర - రెండు కప్పులు 
గుడ్లు -  ఆరు
మైదాపిండి - పావు కిలో
ఆరెంజ్‌ పండ్లు -  రెండు 
కేక్‌ పౌడర్‌ - కొద్దిగా      
అల్యూమినియం పేపర్‌ -  చిన్నది 
పాలు - ఒక కప్పు 
చక్కెర పొడి - ఒక కప్పు  
కొబ్బరి తురుము - చిన్న కప్పు 

 

తయారుచేయు విధానం:
*  ఒక గిన్నెలో వెన్న వేసుకుని  అందులో చక్కెర, గుడ్లు వేసి కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో ఆరెంజ్‌ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. 
* ఇందులో పాలు, మైదా పిండి నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెర పొడి, కొబ్బరి తురుము కూడా వేసి కలపాలి.
* తరువాత మిశ్రమాన్ని మరీ మందంగా లేదా మరీ పలుచగా కాకుండా కేక్‌ పాన్‌లో వేసుకోవాలి. మిశ్రమాన్ని వేసుకునే ముందు దానిపై కొద్దిగా వెజిటబుల్‌ ఆయిల్‌ని రాయాలి.
* దీన్ని ఓవెన్‌లో పెట్టుకోవాలి. 45 నిమిషాల పాటు ఓవెన్‌లో 350 ఫారన్‌ హీట్‌ వద్ద వుంచాలి. ఎంతో రుచిగా వుండే కేక్‌ రెడీ. 
* దీనిపై క్రీమ్‌తో డెకరేషన్‌ చేసుకోవాలి. దానిపై చెర్రీస్‌ అమరిస్తే మరింత బాగుంటుంది.