లాభాల్లో స్టాక్ మార్కెట్లు...
ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 171పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ను ఆరంభించగా... సాయంత్రానికి బీఎస్ఈ సెన్సెక్స్ 245.11 పాయింట్లు లాభపడి 26,878.24 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 83.30 పాయింట్ల లాభంతో 8,273.80 వద్ద స్థిరపడింది. అదానీ పోర్ట్స్, టాటామోటార్స్(డి), యెస్ బ్యాంకు, టాటా స్టీల్, టాటా మోటార్స్ మొదలైన షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.