Read more!

పూరీ జగన్నాథ్ భార్యకి వైకాపా టిక్కెట్టు

 

వైఎస్సాఆర్ సీపీ పార్టీ గెలుపు గుర్రాల వేటలో పడింది. ముందస్తుగా అభ్యర్ధుల్ని నిర్ణయించుకోవడంవల్ల ఆఖరి నిముషంలో అనవసరమైన హడావుడిని నివారించొచ్చన్నది జగన్ వర్గం వ్యూహంగా కనిపిస్తోంది. ముందుగా అనుకున్నట్టుగానే కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా ద్వారా వైకాపా అధ్యక్షుడికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కి ఆశించిన లాభం చాలా దగ్గర్లో ఉన్నట్టే కనిపిస్తోంది.

 

రాబోయే ఎన్నికల్లో వైకాపా తరఫున పూరీ భార్య అనకాపల్లి నుంచి గానీ లేదా నర్సీపట్నం నుంచి గానీ పార్లమెంటరీ స్థానానికి పోటీచేయబోతున్నారన్న వార్తలు నిజమయ్యే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయ్. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకదాన్నుంచి పూరీ భార్య బరిలోకి దిగడం ఖాయమన్న ప్రచారం వైకాపాలోకూడా బాగా జరుగుతోంది.

 

టిడిపిలో కొన్నేళ్లపాటు పనిచేసిన పూరీ సోదరుడు ఉమాశంకర్ గణేష్ ప్రస్తుతం వైఎస్సాఆర్ సీపీ నేత అవతారమెత్తాడు. కాపు ఓట్లని మొత్తంగా గంపగుత్తగా చేజిక్కించుకునేందుకే పూరీ భార్యని బరిలోకి దించాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. కొణతాలకు అనకాపల్లి ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చేస్తే పార్లమెంట్ కి పార్లమెంట్ టిక్కెట్టివ్వొచ్చని జగన్ వర్గం భావిస్తున్నట్టు సమాచారం.