టీడీపీలో మగాళ్లు లేరా..? చెవిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
posted on May 18, 2016 @ 1:11PM
ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి.. ప్రతి పక్ష నేతలు వరుసపెట్టి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్ష నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాలనను పక్కన పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలను కొనే పనిలో పడ్డారు.. అని విమర్శించారు. జగన్ గెలిపించిన ఎమ్మెల్యేలందరూ మగాళ్లు.. ఏం మీ పార్టీలో మగాళ్లు లేరా..? మీ ఎమ్మెల్యేలంతా ఆడంగులా? కాదు కాదు, ఆడంగులంటే మహిళలు ఆగ్రహిస్తారు. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆడా, మగా కాని ‘మాడా’లా?’’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ జలదీక్ష చేపట్టిన సంగతి తెలసిందే.