ప్రత్యేక రాయలసీమపై మైసురా హడావుడి అందుకే తగ్గిందా?
posted on Nov 12, 2015 @ 11:05AM
నిన్న మొన్నటి దాకా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం అంటూ తెగ హడావుడి చేసిన మైసురారెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. రాయలసీమ రాష్ట్రం సాధన కోసం సొంతంగా పార్టీ పెట్టాలని చూసిన ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. అసలు జగన్ చేసే పోరాటాలనే ఎవరూ పట్టించుకునేవారు లేరు.. ఇంక మైసురా ను ఎవరూ పట్టించుకుంటారు. కనీసం ప్రజలు కాదు కదా.. మైసురా చేసిన ఆలోచనలకు తమ పార్టీ మిగతా నాయకులనుండే సరైన స్పందన రాలేదు. దీంతో ఆయన కూడ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించడమే తన లక్ష్యం అంటూ మైసురా చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను మాత్రం ఓ ఇంగ్లీష్ దినపత్రిక మాత్రం సీరియస్ గా తీసుకొని మైసురా ఇంటర్య్వూని ప్రచురించింది. దీంతో మైసురా రాయలసీమ సాధన కోసం నాయకత్వం వహించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే విచిత్రమేంటంటే.. తాను ఎలాంటి పత్రికకు ఇంటర్య్వూ ఇవ్వలేదని.. దాని గురించే వివరణ కోరేందుకు ప్రయత్నిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు రాయలసీమ సాధన కోసం పోరాడతానన్న మైసురా ఇలా ఎందుకు మాట్లాడారా అని ఆశ్చర్యపోయారు. అయితే ఇంత సడెన్ గా మైసూరా యూటర్న్ తీసుకోవడానికి కారణం తన ఉద్యమానికి సరైన రెస్పాన్స్ రాకపోవడమే అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఏదో హడావుడి చేసిన మైసురాకి ఇప్పుడు అవన్నీ వర్కవుట్ కావని బాగా అర్ధమయినట్టుంది.