గన్నవరం వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం.. వల్లభనేనిపై తీవ్ర ఆరోపణలు
posted on Dec 15, 2020 @ 1:55PM
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా, గన్నవరంలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం మధ్యాహ్నం వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లుపై జోజిబాబు జోజిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, దళితులకు రావాల్సిన టెండర్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని వల్లభనేని వంశీ, కోట్లు నాశనం చేస్తున్నారని.. వీరిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని జోజిబాబు డిమాండ్ చేశారు.