కేంద్రమంత్రిగారి భార్యకు బెదిరింపులు..కుటుంబపరువు తీస్తా
posted on Aug 17, 2016 @ 4:28PM
సామాన్య ప్రజలకే కాదు ఈమధ్య రాజకీయ నేతలకు కూడా బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ భార్యకు కూడా ఈ బెదిరింపులు ఎదురయ్యాయి. వీకే సింగ్ సతీమణి భారతీ సింగ్ కు ఫోన్ చేసి ఓ వ్యక్తి ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేశాడు. వివరాల ప్రకారం.. ప్రదీప్ చౌహాన్ అనే వ్యక్తి వీకే సింగ్ ఇంటికి ఫోన్ చేసి తాను భారతీ సింగ్ భార్య స్నేహితురాలి బంధువుగా పరిచయం చేసుకొని ఆమెతో మాట్లాడాతు. అయితే అలా మాట్లాడుతూ..ఆ తర్వత తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అంతేకాదు తాను అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే కుటుంబపరువు తీస్తానని.. కుటుంబం పరువుకు భంగం కలిగించే ఆడియో, వీడియో టేపులను సోషల్ మీడియాలో పెడతానంటూ అతడు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడట. దీంతో వీకే సింగ్ భార్య ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం కేంద్ర మంత్రి కుటుంబానికి చెందిన వ్యవహారం కావడంతో పోలీసులు సమాచారం బయటపెట్టడానికి నిరాకరిస్తున్నారు.