వెంకయ్యకు సన్మాన సభ.. అందుకే ఈ సభ
posted on Sep 17, 2016 @ 11:34AM
విజయవాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి సన్మాన సభ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకు గాను వెంకయ్యనాయుడికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడకు ర్యాలీగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజీపై అవగాహన కల్పించేందుకు.. ప్యాకేజీపై విమర్శలు తిప్పికొట్టేందుకు విజయవాడకు వచ్చా.. నేతల కంటే జనం తెలివైనవారు అని మరోసారి రుజువైంది.. ప్యాకేజీ పట్ల ప్రజలు సానుకూలంగానే ఉన్నారు అని అన్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలకు మాత్రమే ప్యాకేజీ ఇస్తారు.. 1972లో ఏపీ విడిపోయి ఉంటే ఇప్పుడు ముఖ చిత్రమే వేరుగా ఉండేది.. రాజధానిని అభివృద్ది చేసుకుందామని హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు..విభజన గతం.. అభివృద్ధి మా అభిమతం.. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చాలని కోరా అని అన్నారు. 2004 ఎన్నికల ప్రమాణాల్లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.. విడిపోయి అభివృద్ధి చెందుతారనే.. విభజనకు బీజేపీ మద్దతు తెలిపింది.. అప్పుడు రాష్ట్ర విభజనకు అన్నిపార్టీలు అంగీకారం తెలిపాయి అని వ్యాఖ్యానించారు.