వరవర రావుగారికి బాంబు ప్రేలుళ్ళు వినబడలేదా?
posted on Feb 23, 2013 @ 9:16PM
ఎక్కడయినా పోలీసుల చేతిలో నక్సల్స్ చనిపోతే, మరుక్షణం అక్కడ వాలిపోయి, మానవ హాక్కుల ఉల్లంఘన జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టేసే వరవరరావు గారికి, చివరికి భారత దేశం మీద దాడికి పాల్పడిన కసాబ్, అఫ్జల్ గురూ వంటి ఉగ్రవాదులు కూడా ఉద్యమ కారులలాగే కనిపిస్తారు. వారిని ఉరి తీసినప్పుడు ఆయన వీదులకెక్కి వారిని ఉరితీయడం చాలా అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ చాలా గగ్గోలు చేసేస్తారు. కానీ మొన్న హైదరాబాదులో జరిగిన బాంబు ప్రేలుళ్ళలో 16 మంది అమాయక ప్రజలు దుర్మరణం చెందినా, వందమందికి పైగా ప్రజలు తీవ్ర గాయాలపాలయినా కూడా స్పందించడానికి ఆయన నోరు ఎందుకో పెగలట్లేదు. అఫ్జల్ గురూ ఉరికి నిరసనగా వీదులకెక్కి హంగామా చేసిన ఆయన ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదు? గాయపడిన, చనిపోయిన ప్రజలకి ఆయన చెప్పే మానవ హక్కులు వర్తించవా? లేక అయన కేవలం ఉగ్రవాదులకు, నక్సలయిట్లకు మాత్రమే ప్రాతినిద్యం వహిస్తున్నారా? దేశం యావత్తు స్పందించిన ఈ దుర్ఘటనపై ఇటువంటి ‘మహా మేధావులు’ స్పందించకపోవడం ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?