జైరా౦ నోటిని అదుపులో పెట్టుకోవాలి
posted on Mar 11, 2014 @ 4:11PM
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైరామ్ తెలంగాణ పాలిట విలన్ గా మారారని అన్నారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని,లేకపొతే తెలంగాణ ప్రజలు తగినబుద్ది చెబుతారని హెచ్చరించారు. తెరాస, కాంగ్రెస్ మధ్య చిచ్చుపెట్టేలా జైరామ్ రమేష్ వ్యాఖ్యలు వున్నాయని అన్నారు. సోనియా గాంధీని ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జై రామ్ చేష్టలు తెలంగాణాలో కాంగ్రెస్ ను నిండా ముంచుతాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ జెఏసి నేతలకు టిక్కెట్లు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్... ఉద్యమం సమయంలో ఏం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఉద్యోగాలను కేసులు పెట్టి, వేధించి కోర్టుల చుట్టు తిప్పిందన్నారు. జైరామ్ మిడిమిడి జ్ఞానంతో తెరాసపై విమర్శలు చేస్తున్నారని, తెలంగాణపై, తెరాసపై విషం కక్కుతున్నారన్నారు. జైరామ్ తీరు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని, మనిషిని చంపి పూలు చల్లినట్లుగా ఉందన్నారు.