నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!
posted on Apr 27, 2020 @ 11:09AM
టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగురవేశారు. తెలంగాణ భవన్లో టీఆరెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పులా మాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా నేపథ్యంలో కొద్ది మంది నేతలకు మాత్రమే తెలంగాణ భవన్లోకి అనుమతించారు. ఈ కార్యక్రమానికి కేకే, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, మేయర్, డిప్యూటీ మేయర్, చిప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ సుమన్, విప్ కర్నె ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈసారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికివారు తమ ప్రాంతాల్లోనే అంత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.