కరీంనగర్ సభలో సోనియాగాంధీ సారీ చెప్పాల్సిందే
posted on Apr 16, 2014 @ 3:38PM
సీమాంధ్రని చావగొట్టి చెవులు మూసి మరీ తెలంగాణ ఇచ్చానని, మీ ఓట్లు మా పార్టీకే వేయండని చెప్పుకోవడాని కరీంనగర్ వస్తున్న సోనియాగాంధీ మీద టీఆర్ఎస్ మాటల దాడి ప్రారంభించింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడానికి ముందు 1200 మంది బలిదానాలకు కారణమైన సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలని నయవంచన చేసిందని, అందువల్లే ఈ ప్రాంత ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నాడు. అంచేత కరీంనగర్ సభలో సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పడంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నామని ప్రకటించాలని, పోలవరం డిజైన్ మారుస్తున్నట్టు, ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సిందేనని కేటీఆర్ గర్జించాడు.