సిఎంపై ఒత్తిడి తెస్తున్న సుబ్బిరామి రెడ్డి
posted on Apr 18, 2013 8:55AM
కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు నెల్లూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ సారి తాను విశాఖపట్నం నుండి పోటీ చేస్తున్నాని, తాను రాజ్యసభకు ఎన్నిక అవడంవల్ల పురందీశ్వరి విశాఖపట్నం నుండి పోటీ చేశారని, వచ్చే ఎన్నికల్లో పురందీశ్వరి నరసరావుపేట నుండి పోటీ చేయనున్నారని అందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 32 ఏళ్ళుగా తనకు విశాఖపట్నం ప్రజలతో ప్రేమానుబంధాలు ముడిపడి వున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే తాను మైనారిటీ, మత్సకారులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, క్రీడాకారుల కమిటీలను ఎప్పుడో నియమించానని, వంద మందిరాలు, వంద చర్చిలను, వంద మసీదులను పునర్మిస్తున్నానని చెప్పారు. అలాగే తాను మైనారిటీ, అట్టడుగు, అణగారిన వర్గాల కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నాని తెలిపారు. ఈ నెల 28న ఎస్సీ, ఎస్టీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాల్సిందిగా పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణను ఆహ్వానించడానికి తాను కలిసానని తెలిపారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సా సత్యనారాయణను సుబ్బిరామిరెడ్డి వేరువేరుగా కలిసి సమావేశమయ్యారు.