టిడిపి ఎంపీలు సస్పెండ్
posted on Aug 26, 2013 @ 3:18PM
సమైక్యాంధ్రకు మద్దతుగా లోక్ సభలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్ సభలో తమ సభ్యులను సస్పెండ్ చేయడం అన్యాయమని, దీనిపై ప్రభుత్వ వివరణ కావాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు నినాదాలు చేశారు. అయితే లోక్ సభలో సస్పెన్షన్ల గురించి రాజ్యసభలో చర్చించే అలవాటు లేదని, సభ్యులిద్దరూ సహకరించి తమ తమ స్థానాలలోకి వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఇప్పటికే లోక్ సభ నుండి సస్సెండ్ అయిన లోక్ సభ సభ్యులు ముగ్గురు పార్లమెంటు ఆవరణలో నిరవధిక దీక్షకు దిగారు.