రవిశంకర్ గురూజీ కి ఎదురు దెబ్బ.. నాశనం చేశారు..
posted on Aug 17, 2016 @ 1:03PM
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కి ఎదురు దెబ్బ తగిలింది. గత కొద్దిరోజుల క్రితం ఆయన యమునా నదీ తీరాన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యమునా నదీ తీర ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన కమిటీ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదించింది. జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ అక్కడి వాతావరణాన్ని పరిశీలించి.. దాదాపు 47 పేజీల నివేదికను అందించింది. అక్కడి పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని నివేదికలో పాల్గొన్నారు. కాగా రవిశంకర్ గురూజీ ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి ఇచ్చేది లేదని తెలిపినా రవిశంకర్ గురూజీ మాత్రం వినలేదు. అంతేకాదు దానికి ఆయన జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఏం చర్యలు తీసకుంటారో చూడాలి.