సోనియా గాంధీకి 'పిచ్చి'పట్టింది
posted on Feb 22, 2014 @ 3:02PM
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపైన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా గాంధీకి పిచ్చి పట్టిందని అన్నారు. అధికారం అనే రాయి ఆమె చేతిలో వుందని, ఆ రాయితో ఏం చేస్తుందో తనకే తెలియదని ఆరోపించారు. ఆమె పిచ్చితో తెలుగు ప్రజలకు అనేక సమస్యలు సృష్టించిందని పేర్కొన్నారు. తానూ సృష్టించిన సమస్య ఫలితంగానే రాజధానికి ఎక్కడ అనేది సీమాంధ్ర ప్రజలకు అర్ధం కావడం లేదని అన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ త్వరలో మాయమవుతుందని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలు పార్టీలలో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. తమిళనాడు మాదిరి ఆంధ్రాలో కూడా ప్రాంతీయ పార్టీల రాజ్యం రాబోతుందని జోస్యం చెప్పారు. కొంతమంది రెండు రోజులు ముఖ్యమంత్రి పదవి కోసం గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని ఆరోపించారు.