టీఆర్ఎస్లో లోకి సండ్ర వెంకట వీరయ్య.. మిగిలింది రేవంత్ ఒక్కడే..?
posted on May 10, 2016 @ 2:51PM
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లోకి ఇప్పటికే టీడీపీ నేతలు వరుస పెట్టి జంప్ అయిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుండి గెలుపొందగా ఆఖరికి ముగ్గురు మాత్రమే మిగిలారు. అయితే ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈయన ఎంట్రీ దాదాపు ఖరారైపోయినట్టేనని, టీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనిపై ఆయనను ఆడుగగా.. ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మాత్రం చెప్పి అప్పటికి తప్పించుకున్నారట. దీంతో టీడీపీలో ఉన్న ముగ్గురిలో సండ్ర కూడా టీఆర్ఎస్లో చేరితే మిగిలింది ఇద్దరు.. ఈ ఇద్దరిలో ఆర్.కృష్ణయ్య టీడీపీ తరుపున క్రియాశీలకంగా లేరు కాబట్టి.. ఇక మిగిలేది రేవంత్ రెడ్డి ఒక్కడే.